కర్ణాటకలో ఘోరం ...
- September 15, 2016
కావేరీ జలాల వివాదంతో హుమ్నాబాద్ ప్రాంతంలో ఆందోళనకారులు ఒక వోల్వో బస్సుకు నిప్పు పెట్టారు. దాంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. బస్సులో మరికొంతమంది ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది ఇంకా సమాచారం అందలేదు. ఈ దుర్ఘటనలో మరికొంతమంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. 11 మందికి తీవ్రగాయాలు కాగా, పాటిల్ అనే ఒక అదనపు ఎస్పీ మరణించారని అంటున్నారు. ఒక లారీ, ఈ బస్సు ఢీకొన్నాయని, అందువల్ల బస్సులో షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రమాదం సంభవించిందని కర్ణాటక పోలీసులు చెబుతుండగా.. ప్రయాణికులు మాత్రం ఆందోళనకారులే నిప్పుపెట్టారని అంటున్నారు.బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
కావేరీ జలాల వివాదం సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తుండటంతో ఆ ప్రభావం కర్ణాటక మీద కూడా పడింది. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం కనపడితే చాలు.. ఆందోళనకారులు వాటిని తగలబెట్టేస్తున్నారు. ఇప్పుడు కూడా ''టీఎన్'' అనుకుని ''టీఎస్'' రిజిస్ట్రేషన్ ఉన్న బస్సుకు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









