వేలాది పుస్తకాల పంపిణీ: మినిస్ట్రీ

- September 17, 2016 , by Maagulf
వేలాది పుస్తకాల పంపిణీ: మినిస్ట్రీ

రియాద్‌: ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ, రియాద్‌లోని విద్యార్థినీ విద్యార్థులకు పెద్ద సంఖ్యలో పుస్తకాల్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది. రియాద్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌ మొహమ్మద్‌ అల్‌ మోర్షెద్‌ మాట్లాడుతూ, గత నెలలోనే స్కూలు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యిందన్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌కి కూడా పుస్తకాల్ని పంపినీ చేస్తున్నట్లు చెప్పారాయన. ఎడ్యుకేషనల్‌ కమిటీ, సోషల్‌ మీడియా అకౌంట్లను ప్రారంభించిందనీ, వీటి ద్వారా స్కూల్‌ కరికులా సహా పలు వివరాల్ని అందరికీ చేరువయ్యేలా చేస్తోందని వివరించారు మొహమ్మద్‌. ఇంకో వైపున, సౌదీ మినిస్ట్రీ, సౌదీ ల్యాండ్‌ మార్క్‌ కాంపిటీషన్‌ కోసం 36 మంది మేల్‌ మరియు ఫిమేల్‌ అభ్యర్థుల వివరాల్ని ఇటీవలే వెల్లడించింది. చారిత్రక మరియు మోడ్రన్‌ ల్యాండ్‌ మార్క్‌పై ఈ కాంపిటీషన్‌ జరుగుతుంది. సిటిజన్‌షిప్‌, ఐడెంటిటీ ఆఫ్‌ సౌదీ అరేబియా మరియు ఇస్లామిక్‌ ఐడెంటిటీని ప్రమోట్‌ చేయడానికి ఈ కాంపిటీషన్‌ని నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు అభ్యర్థులకు ట్రైనింగ్‌ క్యాంప్‌ని ఏర్పాటు చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com