ఖైదీలకు డ్రోన్ హెలికాఫ్టర్ ద్వారా మాధకద్రవ్యాల సరఫరా
- September 18, 2016
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకొంటుందో ఏమోగానీ...విద్రోహశక్తులు మాత్రం విన్నూత్న ప్రయోగాలు చేస్తూ..అధికారులకు మతులు పోగొడుతున్నారు.
సెంట్రల్ జైల్ వద్ద ఫస్ట్ లెఫ్టినెంట్ జనరల్ జైలు హాల్ పై భాగంలో ఒక వింత ధ్వని వినడం జరిగింది. ఆ శబ్దం ఏమై ఉంటుందోనని ఆయన నిశితంగా పరిశీలన చేయగా ఒక రిమోట్ తో నియంత్రించే డ్రోన్ హెలికాఫ్టర్ చూడటం జరిగింది. దానితో విస్తు పోయిన ఆ అధికారి మరింత పరీక్షగా ఆ ఎగిరే బొమ్మలాంటి హెలికాఫ్టర్ అడుగు భాగంలో ఒక పెద్ద ప్యాకేజీ ఉందని గ్రహించారు. ఆ అధికారి ప్యాకేజీ తెరిచి చూడగా అనుమానిత తెల్లని రంగు గల పౌడర్ ఉన్న మూడు ప్లాస్టిక్ సంచులు దొరికేయి. వాటిని పరిశీలించి చూడగా అదో శక్తివంతమైన మత్తు కల్గించే మాదక ద్రవ్యంగా గుర్తించడం జరిగింది. జైలులో ఉన్న ఖైదీలలో కొందరకి ఈ తరహా సరఫరా ద్వారా సరఫరా చేస్తున్నట్లుగా ఆయన గ్రహించి వెంటనే ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించారు. ఈ అక్రమ రవాణా పై ఒక కేసు దాఖలు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









