మరిన్ని ఆసుపత్రులకు హెచ్ఎంసి మెటర్నిటీ సేవలు
- September 19, 2016
దోహా: హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) మెటర్నిటీ సర్వీసులను అల్ వక్రా, దుఖాన్, అల్ ఖోర్ ఆసుపత్రులకు విస్తరించడం ద్వారా విమెన్ హాస్పిటల్పై బర్డెన్ని తగ్గించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదివరకు పూర్తిగా విమెన్ హాస్పిటల్పైనే ఒత్తిడి ఉండేదనీ, ఇప్పుడు ఆ సేవలను విస్తరించడం ద్వారా విమెన్ హాస్పిటల్పై ఒత్తిడి తగ్గడమే కాకుండా, గర్భిణీ స్త్రీలకు తమకు దగ్గరలో వైద్య చికిత్స పొందడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ ప్రక్రియకు వీలు కలగడం జరుగుతున్నాయి. విమెన్ హాస్పిటల్లో రద్దీ 25 శాతం తగ్గగా, అదే సమయంలో నెట్ వర్క్ హాస్పిటల్స్లో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. 2013లో 18,000 డెలివరీ కేసుల్ని డీల్ చేసిన విమెన్ హాస్పిటల్, 2014లో 16,000 కేసుల్ని మాత్రమే డీల్ చేసింది. ఆ కేసులన్నీ నెట్ వర్క్ హాస్పిటల్స్కి తరలి వెళ్ళాయి. అల్ వక్రా 3,673 కేసులతో 77 శాతం వృద్ధిని నమోదు చేయగా, అల్ ఖోర్ హాస్పిటల్లో 2014లో 1,197 డెలివరీలు జరిగాయి. అయితే ఇది ఏడు శాతం మాత్రమే.క్యుబన్ హాస్పిటల్లో మాత్రం 88 శాతం వృద్ధితో 256 డెలివరీలు జరిగాయి.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







