బహ్రెయిన్ నకిలీ బంగారం కేసు వాయిదా
- August 11, 2015
నకిలీ బంగారు ఆభరణాల విక్రయం కేసులో నిందితుడైన 31 సంవత్సరాల పాకిస్తానీ వ్యక్తిని బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు ముందు హాజరుపర్చిన నేపధ్యంలో, ప్రాసిక్యూషన్ వారికి సాక్ష్యాధారాల సేకరణకుగాను సమయమిస్తూ ఈ కేసు అక్టోబర్ 26 కు వాయిదా పడింది. సంబంధిత నిందితుడు, గత సంవత్సరం సెప్టెంబర్ 12 న రీఫ్ఫాలోని వెజాల్ జువెల్లర్స్ లో 13 బంగారు బ్రాసెలెట్లను కొత్తబంగారం కోసం మార్పిడిచేయబోగా, వాటిపై హాల్మార్క్ ఉన్నప్పటికీ, అవి 22 కారట్లవి కావని కనుగొన్న సంగతి విదితమే. నకిలీ పాస్పోర్టును కూడా కొనుగోలుచేయబోయిన ఈ వ్యక్తి, అవి నకిలీవని తనకు తెలియదని బుకాయిస్తుండగా, పారిశ్రామిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వారి హల్మార్కింగ్ మరియు ఇన్స్పెక్షన్ యూనిట్ వారు 112.9 గ్రాముల బరువుగల ఈ బ్రాసెలేట్లు 22 కార ట్ కావని స్పష్టం చేశారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









