చౌరస్తాలో పేలుడు : ఒకరికి గాయాలు
- October 02, 2016ఇబ్రహీంపట్నం చౌరస్తాలో శనివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఇబ్రహీంపట్నం చౌరస్తా సమీపంలో విజయలక్ష్మి వస్త్రాలయం ముందు పేలుడు జరిగింది. పక్కనే ఉన్న జిలేబి బండి నిర్వహకుడు నాగరాజు (40)కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే నిలిపి ఉన్న స్కూటర్ (ఏపీ 28 జీ 3498) డిక్కి ఓపెన్ అయి ఉంది. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్భీ నగర్ డీసీపీ తప్సీర్ ఇక్భాల్, ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ్గౌడ్ సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు.డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. కాగా పేలింది కిరోసిన్ డబ్బా అని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ తెలిపారు. జిలేబీ బండి కింద ఉన్న కిరోసిన్ డబ్బా వేడికి పేలిపోయి ఈ దాటికి స్కూటర్ డిక్కీ ఓపెన్ అయిందని బండి నడుపుకుకునే వ్యక్తికి గాయమైందని తెలిపారు. ఎలాంటిపుకార్లునమ్మవద్దన్నారు.గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజును సీపీ, డీసీపీ పరామర్శిం చారు. వైద్య ఖర్చులకోసం పది వేల రూపాయలు సాయం అందిం చారు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..