పాకిస్థాన్లో అమానవీయ ఘటన....
- October 05, 2016
పాకిస్థాన్లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు షియా తెగకు చెందిన మహిళలపై ఓ గుర్తుతెలియని అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు ద్విచక్ర వాహనాలపై బస్సును వెంబడించి, బస్సులోని మహిళలను టార్గెట్ చేసుకుని ఆ వ్యక్తి బుల్లెట్ల వర్షం కురిపించాడు. క్వెటా సిటీ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాలిబన్లే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. షీతే తెగకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని గతంలో కూడా తాలిబన్లు పలు చోట్ల దాడి చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









