షార్జాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
- October 05, 2016
షార్జా : ఆసియా దేశాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో షార్జా పోలీసులు ఆ మరణానికి కారణాల గూర్చి పరిశోధిస్తున్నారు. షార్జాలోని అల్ క్కులైహ ప్రాంతంలో ఒక నిర్మాణ స్థలం వద్ద అనుమానాస్పద రీతిలొ పడి ఉన్న శవాన్నిభావన నిర్మాణ కార్మికులు తొలుత కనుగొన్నారు. ఈ గుర్తు తెలియని శవం గూర్చిన సమాచారం మంగళవారం ఉదయం పోలీసులకు అందింది. పోలీస్ గస్తీ దళం, అంబులెన్స్ మరియు సిఐడి అధికారులు సన్నివేశ స్థలానికి వచ్చి అక్కడ వేలి ముద్రలు కొన్ని ఆధారాలు సేకరించారు. మరణించిన వ్యక్తి వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం వలన ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించలేకపోయారు. మరింత పరిశోధన కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









