సంప్రదాయ పాస్వర్డ్లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది!
- October 09, 2016
సంప్రదాయ పాస్వర్డ్లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది! బయోమెట్రిక్, రెటినా లాంటి అధునాతన భద్రతా అంచెలనూ తలదన్నెలా.. సరికొత్త వ్యవస్థను పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు. మెదడు తరంగాలతో వ్యక్తులను గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేశారు. మెదడులోని చర్యలను నమోదుచేసే, పర్యవేక్షించే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ (ఈఈజీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ తరహా భద్రతా వ్యవస్థపై సైబర్ ముఠాలు దాడిచేసే అవకాశం చాలా తక్కువని దీన్ని అభివృద్ధిచేసిన టెక్సాస్ టెక్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. దీంతో అనుసంధానించిన కంప్యూటర్పై మనం పని చేస్తున్నప్పుడు.. ఈఈజీలు నిరంతరంగా మన మెదడులోని తరంగాలను నమోదు చేస్తుంటాయి.అత్యవసర సమయాల్లో మనం పక్కకు వెళ్లినప్పుడు ఎవరైనా మన కంప్యూటర్ను ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే.. వెంటనే లాక్ పడిపోతుంది. స్వచలితంగా తెరచుకునే తలుపులు, వెలిగే లైట్లు, ఫేన్లు తదితర విద్యుత్తు పరికరాలతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతలోనూ ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశముంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









