ఆత్మాహుతి దాడిలో 46 మంది మృతి ...

- October 15, 2016 , by Maagulf
ఆత్మాహుతి దాడిలో 46 మంది మృతి ...

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నగరంలో షియా ముస్లింలతో రద్దీగా వున్న ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారని, మరో 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 7వ శతాబ్దం నాటి మహ్మద్‌ ప్రవక్త మనుమడు హుస్సేన్‌ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షియాలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలతో నింపిన కారులో దూసుకు వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఇటీవల మరణించిన స్థానిక నేతకు సంతాపం తెలిపేందుకు కొందరు ప్రజలు అక్కడికి వచ్చినట్లు అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com