శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది!
- October 23, 2016
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. విదేశాల నుంచి ప్రయాణికులు ఏదో ఒక మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. బ్యాగ్లోనో లేదా షూ స్ లేదంటే తల వెంట్రుకల్లో గోల్డ్ను అక్రమంగా స్వదేశానికి చేరవేస్తునే ఉన్నారు. కస్టమ్స్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అక్రమ బంగారం పట్టుబడడం సాధారణంగా మారింది.
తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ప్రయాణికుడు కిలోన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. మస్కట్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఆయన లగేజీ దాచిపెట్టాడు. అయితే అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆయన గుట్టు రట్టయింది. నిందితున్ని అదుపులోకి తీసుకొని కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 40 లక్షలకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









