మైనింగ్ స్కాం నుంచి విముక్తి : యడ్యూరప్ప

- October 26, 2016 , by Maagulf
మైనింగ్ స్కాం నుంచి  విముక్తి : యడ్యూరప్ప

మైనింగ్ స్కాం నుంచి తనకు విముక్తి లభించడంతో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయలేదని న్యాయస్థానం నిర్ధారించిందని అన్నారు. బుధవారం సీబీఐ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే స్పందించిన ఆయన మాట్లాడుతూ ఇంతకాలం తన వెంట ఉన్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నిజం నిలకడమీద తెలిసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు తనకు ఊరట ఇచ్చిందని అన్నారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు వీగిపోయాయని అన్నారు. తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని, తమ కార్యకర్తలకు కొత్త ప్రేరణ లభిస్తుందని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమ కార్యకర్తలు ప్రయత్నిస్తారని యడ్యూరప్ప అన్నారు.యడ్యూరప్పను కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో కర్నాటకలో రాజకీయాలు మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com