మైనింగ్ స్కాం నుంచి విముక్తి : యడ్యూరప్ప
- October 26, 2016
మైనింగ్ స్కాం నుంచి తనకు విముక్తి లభించడంతో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయలేదని న్యాయస్థానం నిర్ధారించిందని అన్నారు. బుధవారం సీబీఐ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే స్పందించిన ఆయన మాట్లాడుతూ ఇంతకాలం తన వెంట ఉన్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నిజం నిలకడమీద తెలిసిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు తనకు ఊరట ఇచ్చిందని అన్నారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలు వీగిపోయాయని అన్నారు. తనకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని, తమ కార్యకర్తలకు కొత్త ప్రేరణ లభిస్తుందని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమ కార్యకర్తలు ప్రయత్నిస్తారని యడ్యూరప్ప అన్నారు.యడ్యూరప్పను కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో కర్నాటకలో రాజకీయాలు మారతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









