'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు నిధి ఏర్పాటు..
- November 01, 2016
భారతీయ సినిమారంగానికి ఎనలేని ప్రోత్సాహాన్ని అందజేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న 47వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం కర్టెన్రైజర్ కార్యక్రమం మంగళవారంనాడు జరిగింది. ఇందులో భాగంగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, 'భారతీయ సినిమాను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు ఓ నిధిని ఏర్పాటుచేస్తున్నాం. తాము తీసిన సినిమాలను అంతర్జాతీయస్థాయిలో తీసుకెళ్లాలని అనుకునేవారికి ఈ నిధి నుంచి సాయం అందించడం జరుగుతుంది. మన ఆలోచనలను ఇతరులకు, ఇతరుల ఆలోచనలను మనం పంచుకుని నాణ్యమైన మంచి సినిమాలను నిర్మించేందుకు ఓ మంచిఫ్లాట్ఫామ్ను తయారుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.మొత్తంమీద భారతీయ సినిమాకు ఎనలేని ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డి.సౌజా, ఆ రాష్ట్ర మంత్రి రాజీవ్వర్ధన్రాథోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ.బాలుకు అవార్డుఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2016 అవార్డుకు ప్రముఖ గాయకులు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. గోవా అంతర్జాతీయ చిత్రోత్సవం ముగింపు వేడుకకు ముఖ్యఅతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









