త్వరలో విడుదల కానున్న 'పిజ్జా-2'
- November 03, 2016
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న చిత్రం 'పురియత్ పుధీర్'. ఈ చిత్రాన్ని 'పిజ్జా-2' పేరుతో డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ.. 'ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రం రూపొందించారు. వరుసగా ఏడు హిట్లతో తమిళ సినీ రంగంలో ముందంజలో దూసుకుపోతున్న విజయ్సేతుపతికి ఈ చిత్రం ఎనిమిదో హిట్గా నిలుస్తుంది.
ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ను 48 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది వీక్షించడం హీరో క్రేజ్కు నిదర్శనంగా నిలిచింది. అతి త్వరలోనే తెలుగు వెర్షన్ ట్రైలర్ను విడుదల చేసి, ఇదే నెలలో రెండు భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆద్యంతం ఉత్కంఠతో నడుస్తూ.. ఆసక్తిని కలిగించే స్క్రీన్ప్లేతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ని దర్శకుడు రంజిత్ జయకోడి చక్కగా తీర్చిదిద్దారు' అన్నారు.
ఈ చిత్రంలో గాయత్రి కథానాయికగా నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: శామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్, ఎడిటర్: భావన శ్రీకుమార్.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









