వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడ మునక, 110 మంది మృతి

- November 03, 2016 , by Maagulf
వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడ మునక, 110 మంది మృతి

వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడ పగిలిపోయి 110 మంది మృతి చెందారు. వలసదారులతో లిబియా వెళ్తున్న ఓడ సముద్రం మధ్యలో పగిలిపోయినట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. ప్రమాద సమయంలో ఓడలో 140 మంది ప్రయాణిస్తున్నారు. ఓడలో సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది ప్రయాణికులను ఓడ నుంచి కిందికి విసిరేశారు. దీంతో కేవలం 29 మంది మాత్రం బతికి బట్టగలిగినట్టు ఐరాస శరణార్థుల హైకమిషనర్ అధికార ప్రతినిధి కార్లొట్టె సమి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com