ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది
- August 26, 2015
గుంటూరు జిల్లాలో ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది. ఓ న్యాయవాది ఈ ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. డీఎంఅండ్ హెచ్ఓ, సూపరింటెండెంట్ లకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. తల్లి ఆక్రందన.. ఇదిలా ఉంటే పసికందు మృతి చెందడంపై తల్లి పడుతున్న ఆవేదన పలువురిని కలిచివేస్తోంది. తమ బిడ్డను ఇంకా తీసుకపోనియడం లేదని టెన్ టివితో వాపోయింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎవరూ వచ్చి చూడలేదని తెలిపింది. ఎలుకలు వస్తున్నాయి..దాడి చేస్తున్నాయని పేర్కొన్నా ఎవరూ స్పందించలేదని రోదిస్తూ తెలిపింది. తనను హేళన చేస్తూ మాట్లాడరని, పేదోళ్లం కాబట్టే ఇంతదూరం వచ్చి ఆసుపత్రిలో చేరామని పేర్కొంది. మ బాబును మాకు ఇప్పించాలని ఆ తల్లి వేడుకుంది.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..







