కృష్ణా జిల్లాలో త్వరలో రూ.వెయ్యి కోట్లతో క్షిపణి ప్రయోగ కేంద్రం..
- November 07, 2016
కృష్ణా జిల్లా నాగాయలంకలో త్వరలో రూ.వెయ్యి కోట్లతో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రక్షణ అవసరాలు తీర్చే సామాగ్రి తయారీకి ఏపీ హబ్గా మారుబోతోందని ఆయన పేర్కొన్నారు. 2017 జనవరి 3న తిరుపతిలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అక్కడే ప్రధాని చేతుల మీదుగా సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.విజయవాడ సిద్ధార్థ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించే సైన్స్ కాంగ్రెస్ను సోమవారం చంద్రబాబు ప్రారంభించారు. శాస్త్ర, విజ్ఞానం, ప్రజారోగ్య అభివృద్ధిలో సాంకేతిక విజ్ఞానంపై సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శాస్త్ర, విజ్ఞాన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న యువ శాస్త్రవేత్తలను చంద్రబాబు సత్కరించారు.అనంతరం పద్మభూషన్ రామారావు, డా.బీఎం హెడ్గే, పద్మశ్రీ కాకర్ల సుబ్బారావు, డా. చావా సత్యనారాయణ, డా.బీజీ సిద్ధార్థ, డా.సతీశ్రెడ్డి, డా.శశిథామస్లకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









