సుజిత్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్...

- November 07, 2016 , by Maagulf
సుజిత్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్...

'బాహుబలి' మూవీతో ప్రభాస్‌కి ఆలిండియా అంతా క్రేజ్‌ వచ్చింది. బాలీవుడ్‌లో కూడా ప్రభాస్‌తో డైరెక్ట్ మూవీ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ మూవీతో ప్రభాస్ మార్కెట్ కూడా పెరిగింది. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా ప్రభాస్‌కి మర్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకే.. 'బాహుబలి-2' తరువాత సుజిత్‌ డైరెక్షన్‌లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. 'మిర్చి' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యూవీ క్రియేషన్స్‌ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది.ఈ మూవీ కోసం దుబాయ్‌లో ఓ ఛేజింగ్ ఫైట్ డిజైన్ చేసాడట డైరెక్టర్ సుజిత్.
అయితే.. ఆ ఒక్క ఛేజింగ్‌ ఫైట్‌కే దాదాపు 40 కోట్ల వరకూ ఖర్చుపెట్టడాని రెడీ అయ్యాడట ప్రభాస్. ఆ ఫైట్ కోసం హాలీవుడ్‌ టాప్ టెక్నీషియన్‌ను తీసుకొస్తారట. అయితే ఇదే హాలీవుడ్ టెక్నీషియన్‌ని రజనీకాంత్ 'రోబో-2' కోసం తీసుకురావాలనుకున్నాడట శంకర్‌.
కానీ.. అతని రెమ్యునరేషన్‌కు భయపడి వెనక్కుతగ్గాడట. కానీ.. ప్రభాస్ కోసం ఎంత ఖర్చు పెట్టి అయినా ఆ టెక్నీషియన్‌తోనే ఛేజింగ్ ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారట ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com