తెలంగాణ మూడు వ దఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల..
- November 08, 2016
తెలంగాణ ప్రభుత్వం మరోదఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రూ.2019.19కోట్ల నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు దశల్లో నిధులు విడుదల చేయగా ఇవి మూడో దశలో రెండో విడత రుణమాఫీ నిధులుగా ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.17వేల కోట్లు రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రుణాలను నాలుగేళ్లలో చెల్లించాలని, ఏటా రూ.4250 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో మొదటి ఏడాది ఒకేసారి రూ.4250 కోట్లు విడుదల చేశారు. రెండో ఏడాది నుంచి రెండు దశల్లో రుణాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. గతేడాది సెప్టెంబర్ లోపే చెల్లించగా ఈ సంవత్సరం కొంత ఆలస్యమైంది.
మొదటి దఫా కింద రూ.2100కోట్లను విడుదల చేయగా మిగిలిన బకాయిలను ఈరోజు విడుదల చేసింది. మొత్తం రూ.2019.19కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. వచ్చే సంవత్సరం మాత్రం ఒకే దఫాలో జులై నెలలోనే రూ.4250కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









