ట్రంప్ మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం కోసం కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం
- November 10, 2016
రియాద్ : అమెరికా తదుపరి అధ్యక్షులుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్కు సౌదీ రాజు సల్మాన్ బుధవారం ఒక సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం సాధించడానికి కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ద్వారా నివేదించారు. ఇరు దేశాల సంబంధాలు మరింతగా అత్యున్నత స్థాయికి వెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ రాజు సల్మాన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉండే సంబంధాలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. చారిత్రక మరియు పటిష్టమైన స్నేహపూర్వక విధానాలు రెండు దేశాల మధ్య అభివృద్ధి మరియు గట్టిగా బలోపేతం కావాలని ఆయన కోరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా కు మరియు సౌదీ అరేబియా దేశాల మధ్య సౌదీ చమురు, అమెరికన్ భద్రతా మార్పిడి ఆధారంగా ఒక దశాబ్దాల కాలంగా బలమైన సంబంధం కలిగి ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో గత ఎనిమిది సంవత్సరాల డెమోక్రటిక్ పరిపాలన సమయంలో రియాద్ వాషింగ్టన్ మధ్య సంబంధాలు భయపెట్టిన తీరులో మారిందని సౌదీ రాజు గుర్తు చేశారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









