డ్రగ్ స్మగ్లర్స్కి 10 ఏళ్ళ జైలు
- November 11, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఇద్దరు వలసదారులైన పురుషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. దాంతోపాటుగా 200,000 ఖతారీ రియాల్స్ని జరీమానా విధించింది. ఈ ఇద్దరు నిందితులు అక్రమంగా డ్రగ్స్ని సరఫరా చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో వ్యక్తికి ఏడాది జైలుతోపాటు 10 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. డ్రగ్స్ సేవించిన ఆరోపణలు ఆ వ్యక్తిపై ఉన్నాయి. ఓ మెయిడ్ తనకు ఓ అపరిచిత వ్యక్తి, తన చేతిలో ఓ బ్యాగ్ పెట్టి ఓ చోట ఇవ్వాల్సిందిగా కోరాడనీ, అయితే తాను అందుకు అంగీకరించలేదని తన యజమాని సన్నిహితుడితో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు, రిప్రెజెంటేటివ్కి 15,000 రియాల్స్ని ఆఫర్ చేశాడు బ్యాగ్ని తరలించేందుకోసం. బ్యాగ్లో కిలో బరువైన నిషేధిత డ్రగ్ మురిజువానాని పోలీసులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







