డ్రగ్ స్మగ్లర్స్కి 10 ఏళ్ళ జైలు
- November 11, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఇద్దరు వలసదారులైన పురుషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. దాంతోపాటుగా 200,000 ఖతారీ రియాల్స్ని జరీమానా విధించింది. ఈ ఇద్దరు నిందితులు అక్రమంగా డ్రగ్స్ని సరఫరా చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో వ్యక్తికి ఏడాది జైలుతోపాటు 10 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. డ్రగ్స్ సేవించిన ఆరోపణలు ఆ వ్యక్తిపై ఉన్నాయి. ఓ మెయిడ్ తనకు ఓ అపరిచిత వ్యక్తి, తన చేతిలో ఓ బ్యాగ్ పెట్టి ఓ చోట ఇవ్వాల్సిందిగా కోరాడనీ, అయితే తాను అందుకు అంగీకరించలేదని తన యజమాని సన్నిహితుడితో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు, రిప్రెజెంటేటివ్కి 15,000 రియాల్స్ని ఆఫర్ చేశాడు బ్యాగ్ని తరలించేందుకోసం. బ్యాగ్లో కిలో బరువైన నిషేధిత డ్రగ్ మురిజువానాని పోలీసులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









