తీర్ధ యాత్రికుల కోసం నూతన ఉమ్రా వీసా ఫీజు
- November 12, 2016
ఉమ్రా కాలం ప్రారంభం కావడంతో తీర్ధయాత్రలకు వెళ్ళేవారు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అనేకమంది ఆసక్తి ఉన్న యాత్రికులు గత మూడు సంవత్సరాల క్రితం చివరిసారిగా ఇక్కడకు వచ్చినపుడు ఖర్చు చేసినదాని కంటే ఎక్కువగా సుమారు సవరించబడిన వీసా ఫీజు 2,000 క్యూ ఆర్ వరకు ఉండవచ్చు.
యాత్రికుల నుంచి వీసా ఫీజు నిమిత్తం 2,000 సౌదీ రియల్స్ మొత్తాన్ని సౌదీ ప్రభుత్వం విధించింది.( 2,000 క్యూ ఆర్ గురించి ) 2013 నుంచి సౌదీ అరేబియా దర్శించిన తీర్ధయాత్రీకులు 3,200 క్యూ ఆర్ మొత్తం చెల్లించవలసి ఉంటుందని అర్థం యాత్రికులు , రవాణా నిమిత్తం మరియు వసతి సౌకర్యంతో సహా రహదారి ప్రయాణం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉమ్రా ఆపరేటర్లకు గత ఏడాది రోడ్డు ద్వారా ఉమ్రా యాత్ర కోసం సాధారణ రోజులలో 1,200 క్యూ ఆర్ ఖర్చు చేస్తే సరిపోయేది . ఉమ్రా తీర్ధ యాత్రికుల కొరకు మూడు సంవత్సరాల (2013) తర్వాత మొదటిసారిగా కొత్త వీసా ఫీజు నుంచి మినహాయింపులు ప్రకటిస్తున్నట్లు వివరించారు. తాము నవంబర్ 1 వ తేదీ నుంచి ఉమ్రా పర్యటనలను మొదలుపెట్టినట్లు స్థానిక యాత్ర నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు వరకు మాకు ఉమ్రా యాత్రకు వెళ్ళే తీర్ధ యాత్రులు సుమారు 100 మంది దరఖాస్తులు అందాయి చేశారు. వారి వీసాకు అభ్యర్థనలు పరిశీలించే పనిలో ఉన్నట్లు వివరించారు. మరియు ఆ యాత్రికులకు మక్కా మరియు మదీనా రవాణా మరియు వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. తమ తదుపరి పర్యటన గురువారం ఉంటుందని వివరించారు. సవరించిన వీసా ఫీజు కింద నమోదైనవారు కేవలం10 శాతం కంటే తక్కువని పేర్కొంటూ మరియు తీర్ధ యాత్రికులతో చాలా మంది 2,000 క్యూ ఆర్ అదనపు వీసా ఫీజు చెల్లించవలసి వచ్చినప్పుడు 60 శాతం మంది వారి మనసుమార్చుకున్నట్లు ఆపరేటర్లు చెప్పారు . ఈ కొత్త నిబంధన అక్టోబర్ నెలలో అమల్లోకి వచ్చింది పిల్లలకు వీసా ఫీజు పెద్దలతో సమానముగా ఉంటాయి. సీట్లు అవసరంలేని శిశువులు మాత్రమే రవాణా, వసతి సౌకర్యం నుండి మినహాయించబడ్డాయి.
తాజా వార్తలు
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









