టెక్సాస్ లో 'ఐ టి సర్వ్ అలయన్స్ 2016 కాన్ఫరెన్స్'... హాజరయిన APNRT టీం
- November 12, 2016
ఐ టి సర్వ్ సినర్జీ 2016 ఫ్రిస్కో లో ఎంబసీ సూట్స్ కన్వెన్షన్ సెంటర్, 10 నవంబర్ న టెక్సాస్ లో ప్రారంభించారు.
ఈ ఈవెంట్ ను మిస్టర్ సతీష్ మండువ మరియు మిస్టర్ శ్రీధర్ పాటిబండ్ల ఇన్వెస్ట్మెంట్ అడ్వైసరీ సమావేశం నిర్వహించారు. వీరు ఈ సమావేశానికి విచ్చేసిన పలువురు ఐటి సభ్యులతోనూ,ఎపిఎన్నార్టి కో ఆర్డినేటర్స్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పెట్టుబడి అవకాశాలని గురించి చర్చలు సాగించారు. సమావేశానికి పలు ఐటి సేవా సంస్థలు, ప్రోడక్ట్ సంస్థలు, మరియు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ హాజరయ్యాయి.
మిస్టర్ రమేష్ తూము, విశాఖపట్నంలో తొమ్మిది ఐటీ కంపెనీల్లో ఒకటైన ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ స్థలం కేటాయింపు కోసం ఎపి ఎన్నార్టి చూపిన చొరవ, సహాయానికి గాను హర్షం వ్యక్తం చేసి, సమావేశంలో ఎపి ఎన్నార్టి సేవలని పలువిధాలుగా మెచ్చుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలనుకునే ఇతర సంస్థలను గుర్తించి వారికి తోడ్పడాలని ఎపి ఎన్నార్టి కి విజ్ఞప్తి చేసారు.
డాక్టర్ రవికుమార్ వేమూరు, అధ్యక్షుడు, ఐటి విధానం కింద లభ్యమగు సౌకర్యాలు మరియు అందుబాటులో ప్రోత్సాహకాలు యొక్క అవగాహన అందించారు. సర్వీస్ కంపెనీలు ఉద్యోగికి 1.5 లక్షలు మరియు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 50% రి ఇమ్బర్స్మేంట్ అవకాశాలు ఉన్న్నాయని, ఆంధ్రప్రదేశ్లోని సెటప్ కార్యకలాపాలు, గొప్ప అవకాశాలు సురక్షిత పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించారు.ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈ ఐ టి కేఫ్ మిస్టర్ రాజ్ ముదునూరు సీఈఓ, నైపుణ్యాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహకాలు పొందడంలో ఉన్న కష్టనష్టాల గురించి తెలుపుతూ వీటిని సులభంగా యాక్సెస్ చేసేవిధంగా తోడ్పడమని ఎపిఎన్నార్టి ని కోరారు. డాక్టర్ రవి వేమూరు మరియు డాక్టర్ ప్రసాద్ పూల వివిధ ఐటి శిక్షణ సంస్థలు నుండి శిక్షణ విజయవంతంగా నిర్వహించడానికి వినూత్నపద్ధతులని వివిధ ఐటి సంస్థల శిక్షణా విదానాలని తెలిపారు.
మిస్టర్ సతీష్ నన్నపనేని ఇ-ప్రొక్యూర్మెంట్ సిస్టంలో విధానపరమైన హర్డిల్స్ సడలింపు సదుపాయం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఐటిప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ పొందడంలో సహాయం చేయమని ఎపిఎన్నార్టి ని అభ్యర్థించారు.
పిదప ఎపిఎన్నార్టి విజయవాడ ప్రాంతంలో వస్తున్న ఇతర ఆఫీస్ స్పేస్ సౌకర్యాల గురించి ఒక అవగాహన అందించింది, వాటి కార్యకలాపాల ప్రారంభ కోసం స్థలాన్ని లీజుకు తీసుకోవాలని సభ్యులని అభ్యర్థించారు.
మిస్టర్ బుచ్చిరాం ప్రసాద్ కలపతపు , శేషు బాబు కానూరి, శ్రీధర్ చిల్లర మరియు ఎపిఎన్నార్టి సుధాకర్ రావు కుదరవల్లి ఈవెంట్ విజయవంతం అవడానికి దోహదం చేసారు.

తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









