మూతపడ్డ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్
- November 22, 2016
తైవాన్ కు చెందిన తొలి ప్రైవేట్ విమానయాన రంగ సంస్థ ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ మూతపడింది. భారీ ఆర్థిక నష్టాలు, ఇటీవల జరిగిన రెండు ప్రమాద ఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ట్రాన్స్ ఏసియా చైర్మన్ విన్సెంట్ లిన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నష్టాలను భరించే స్థితిలేదని, అదనంగా నిధులు సమకూరకపోవడంతో ట్రాన్స్ ఏసియాను మూసివేస్తున్నట్టు తెలిపారు.
1951లో ట్రాన్స్ ఏసియా ఎయిర్ వేస్ ను స్థాపించారు. చైనా, జపాన్, ఆగ్నేయాసియా దేశాల్లోని పలు నగరాల మధ్య ఈ సర్వీసులను నడిపారు. 2014, 2015లో తైవాన్ లో ఈ సంస్థకు చెందిన రెండు విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 92 మంది మరణించారు.
పైలట్ల తప్పిదాల వల్లే ప్రమాదాలు జరిగినట్టు విచారణలో తేలింది. దీనికి తోడు ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ట్రాన్స్ ఏసియా భారీగా నష్టాలు చవిచూసిందని, కోలుకునే అవకాశం కనిపించకపోవడంతో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కంపెనీని మూసివేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నామని విన్సెంట్ లిన్ మీడియా సమావేశంలో చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









