అమ్నెస్టీ: 9,000 అక్రమ నివాసితులు స్వదేశాలకి
- November 24, 2016
మూడు నెలల అమ్నెస్టీ కారణంగా 9000 మంది అక్రమ నివాసితులు ఖతార్ని వీడే అవకాశాలు ఉన్నాయని సీనియర్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ముందుగా ఇంత పెద్ద మొత్తంలో అమ్నెస్టీ కోసం దరఖాస్తులు వస్తాయనుకోలేదనీ, అయితే రాను రాను అమ్నెస్టీని ఆశ్రయించినవారి సంఖ్య పెరిగిందని, 9000 మంది దేశాన్ని వీడనున్నట్లు తాము అంచనా వేస్తున్నామని బ్రిగేడియర్ అబ్దుల్లా జబెర్ అల్ లబ్దా చెప్పారు. వర్క్ వీసా లేకుండా విదేశీయులు దేశంలో పని చేయడం ఖతారీ చట్టాల ప్రకారం అక్రమం, నేరం. ఖఫలా స్పాన్సర్ చట్టాల ప్రకారం ఎవరైనా తమ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే, ఖచ్చితంగా యజమాని నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో యజమానికి చెప్పకుండా వేరే ఉద్యోగాల్ని స్నేహితుల ద్వారా వెతుక్కుని, దేశంలో అక్రమ నివాసితులుగా మారిపోతున్నారు. అలాంటివారికి భవిష్యత్తులో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం అమ్నెస్టీని కల్పిస్తోంది.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







