రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5
- November 27, 2016
నేపాల్ లో సోమవారం భూకంపం సంభవించింది. ఉదయం 5గంటల సమయంలో సోలుకుంబు జిల్లాలోని ఎవరెస్టు ప్రాంతం కేంద్రంగా భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లు చెప్పింది. 2015 ఏప్రిల్ లో భారీ భూకంపం వచ్చిన తర్వాత నేపాల్ లో తరచూ భూమి కంపిస్తూ వస్తోంది.ఇప్పటివరకూ 4 కంటే ఎక్కువ భూకంప తీవ్రతతో భూమి కంపించడం ఇది 475వ సారి. కాగా, సోమవారం సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









