రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5

- November 27, 2016 , by Maagulf
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5

నేపాల్ లో సోమవారం భూకంపం సంభవించింది. ఉదయం 5గంటల సమయంలో సోలుకుంబు జిల్లాలోని ఎవరెస్టు ప్రాంతం కేంద్రంగా భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లు చెప్పింది. 2015 ఏప్రిల్ లో భారీ భూకంపం వచ్చిన తర్వాత నేపాల్ లో తరచూ భూమి కంపిస్తూ వస్తోంది.ఇప్పటివరకూ 4 కంటే ఎక్కువ భూకంప తీవ్రతతో భూమి కంపించడం ఇది 475వ సారి. కాగా, సోమవారం సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com