రోడ్లను బాగుచేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న మినిస్ట్రీ
- November 28, 2016
మనామా: భారీ వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు మినిస్ట్రీ 24 గంటలూ సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. ముహర్రాక్ మునిసిపాలిటీ, ముంపు ప్రాంతాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో సహాయక కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. రోడ్లను పొడిగా ఉంచేందుకు, అలాగే క్లీన్గా మార్చేందుకు ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ప్రతి కంప్లయింట్నీ సునిశితంగా పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు వారు వివరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి మునిసిపాలిటీ 174 నోటిఫికేషన్లను అందుకుంది. ప్రధానంగా ముహర్రాక్ గవర్నరేట్ పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు చెప్పారు. సోషల్ మీడియాలో వీటికి సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా కూడా సహాయక చర్యల్ని చేపట్టారు అధికారులు. ట్విట్టర్, ఇన్స్టగ్రామ్లో ముహర్రాక్ మునిగిపోతోంది అనే పేరుతో కామెంట్స్, పోస్టింగ్స్ ట్రెండింగ్గా మారాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









