తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ...
- December 08, 2016
తెలుగు మీడియంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నిస్తామని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు. తిరుపతిలో గురువారం జరిగిన తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశానికి పల్లె అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి తెలుగు భాషా పండితులు, సాహితీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనే అభిప్రాయం సమాజంలో బలంగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇంటర్ వరకు తెలుగును తప్పని సరి చేస్తామని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కాలేజీలు కూడా ఈ నిబంధన వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, కోర్టు తీర్పలు మాతృభాషలో వచ్చేలా, అధికారులు ప్రజలతో తెలుగులోనే మాట్లాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







