తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ...
- December 08, 2016
తెలుగు మీడియంలో చదువుకున్న యువకులకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నిస్తామని మంత్రి పల్లె రఘునాధరెడ్డి వెల్లడించారు. తిరుపతిలో గురువారం జరిగిన తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి అధ్యయన కమిటీ సమావేశానికి పల్లె అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి తెలుగు భాషా పండితులు, సాహితీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు మీడియం చదువుకుంటే ఉద్యోగాలు రావనే అభిప్రాయం సమాజంలో బలంగా ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం తెలుగు మీడియం చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వారు మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇంటర్ వరకు తెలుగును తప్పని సరి చేస్తామని, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, కాలేజీలు కూడా ఈ నిబంధన వర్తింపజేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, కోర్టు తీర్పలు మాతృభాషలో వచ్చేలా, అధికారులు ప్రజలతో తెలుగులోనే మాట్లాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన వైశాలి: వరల్డ్ టైటిల్ రేసులో భారత యువ కెరటం!
- ప్రాంతీయ స్థిరత్వంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్–పాకిస్థాన్ ప్రధాని కీలక భేటీ
- ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!









