ఖతార్లో ప్రవాస శ్రామికుల చెంతకే మొబైల్ ఎ. టి. ఎం. లు
- September 03, 2015
ఖతార్ ప్రభుత్వం వారి కొత్త 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' WPS కు తమ వంతు సహకారంగా, ప్రవాస కార్మికులు సమ్మర్ధంగా ఉండే చోట్లలో మొబైల్ ఎ. టి. ఎం. యంత్రాలను నియోగించనున్నట్టు అహ్లి బాంక్ వారు ప్రకటించారు. ఖతార్ కార్మిక మరియు సాంఘిక సంక్షేమ శాఖ వారు ఈ నవంబరు 3 నుండి WPS పద్ధతి ప్రకారం ఎలక్ట్రానిక్ విధానంలో వేతనాలు బాంకులలో ఉద్యోగుల ఖాతాలలో జమ చేయబడతాయని ప్రకటించిన సంగతి విదితమే! ఐతే ఈ విధానం వలన ఎ. టి. ఎం. వాడకందారుల సంఖ్య పెరిగి, వాటికీ కొరత వస్తుందని శ్రామికులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అహ్లి బాంకు వారి సాధారణ విస్తరణ వ్యూహంలో భాగంగా, 2016 సంవత్సర ఆరంభానికల్లా మొబైల్ ఎ. టి. ఎం. సేవలను లేబర్ కేoపులు, పెద్ద ఈవెంట్లు వంటిచోట అందుబాటులో ఉంచుతామని, వేతనాల చెల్లింపు రోజులో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా సిద్ధం చేస్తున్నామని బాంకు డేప్యూటీ సి. ఈ. ఓ. ఆండ్రూ మెక్ కెచ్నీ తెలిపారు. ఇక దోహా మెట్రో ప్రోజెక్టు పూర్తయిన అనంతరం, ఆ స్టేషన్లు ఆట్మ్ సేవలు అందించే మరిన్ని అవకాశాలకు నెలవౌతాయన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









