ఖతార్లో ప్రవాస శ్రామికుల చెంతకే మొబైల్ ఎ. టి. ఎం. లు
- September 03, 2015
ఖతార్ ప్రభుత్వం వారి కొత్త 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' WPS కు తమ వంతు సహకారంగా, ప్రవాస కార్మికులు సమ్మర్ధంగా ఉండే చోట్లలో మొబైల్ ఎ. టి. ఎం. యంత్రాలను నియోగించనున్నట్టు అహ్లి బాంక్ వారు ప్రకటించారు. ఖతార్ కార్మిక మరియు సాంఘిక సంక్షేమ శాఖ వారు ఈ నవంబరు 3 నుండి WPS పద్ధతి ప్రకారం ఎలక్ట్రానిక్ విధానంలో వేతనాలు బాంకులలో ఉద్యోగుల ఖాతాలలో జమ చేయబడతాయని ప్రకటించిన సంగతి విదితమే! ఐతే ఈ విధానం వలన ఎ. టి. ఎం. వాడకందారుల సంఖ్య పెరిగి, వాటికీ కొరత వస్తుందని శ్రామికులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అహ్లి బాంకు వారి సాధారణ విస్తరణ వ్యూహంలో భాగంగా, 2016 సంవత్సర ఆరంభానికల్లా మొబైల్ ఎ. టి. ఎం. సేవలను లేబర్ కేoపులు, పెద్ద ఈవెంట్లు వంటిచోట అందుబాటులో ఉంచుతామని, వేతనాల చెల్లింపు రోజులో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా సిద్ధం చేస్తున్నామని బాంకు డేప్యూటీ సి. ఈ. ఓ. ఆండ్రూ మెక్ కెచ్నీ తెలిపారు. ఇక దోహా మెట్రో ప్రోజెక్టు పూర్తయిన అనంతరం, ఆ స్టేషన్లు ఆట్మ్ సేవలు అందించే మరిన్ని అవకాశాలకు నెలవౌతాయన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







