పార్కింగ్ ప్లేస్ ఉండాల్సిందే కారు కొనాలంటే..
- December 23, 2016
దేశ వ్యాప్తంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం కొన్ని రూల్స్ విధించే యోచనలో ఉంది. ముఖ్యంగా కొత్త కార్ల రిజిస్ట్రేషన్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పార్కింగ్ స్పేస్ లభ్యత ఉందని చూపే సర్టిఫికెట్లను అందజేశాకే వాటి రిజిస్ట్రేషన్ ను అనుమతించాలని, ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. మధ్య ప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇదే విషయాన్ని ప్రకటించారు.
ఇకపై టాయిలెట్ లేని ఏ నిర్మాణాన్నీ అనుమతించే ప్రసక్తి లేదని, అలాగే పార్కింగ్ స్పేస్ అవైలబిలిటీ లేనిదే ఏ వాహన రిజిస్ట్రేషన్ నూ అనుమతించే ప్రసక్తి కూడా లేదని ఆయన చెప్పారు. దీనిపై తమ మంత్రిత్వ శాఖ రోడ్లు, జాతీయ రహదారుల మినిస్ట్రీ తో చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు.
భోపాల్ లో గూగుల్ మ్యాప్స్ టాయిలెట్ లొకేటర్ యాప్ ను వెంకయ్య లాంచ్ చేశారు. ఈ యాప్ వల్ల దగ్గరలోని పబ్లిక్ టాయిలెట్ ని ప్రజలు గుర్తించడానికి వీలవుతుందని వెంకయ్య చెప్పారు. స్వచ్చ భారత్ మిషన్ లో ఇదో భాగమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







