త్వరలో మెట్రో రైలు పరుగులు విజయవాడ లో..
- December 27, 2016
విజయవాడ మెట్రో రైల్ విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. తాజాగా వచ్చే ఐదేళ్లకు అవసరమైన నిధులను లోన్ల రూపంలో తీసుకునేందుకు లభించింది. విజయవాడ లో త్వరలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తయ్యేలోగా... మెట్రో రైలు మొదటి దశ పూర్తి చేయాలని ప్రభుత్వం ధృడసంకల్పంతో ఉంది.2018 కల్లా తొలి దశ పూర్తి చేయడం టార్గెట్గా పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. రెండు కారిడార్లకు సంబంధించి DMRC ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు సమకూరస్తుండగా.. రాష్ట్రప్రభుత్వం 20 శాతం నిధులు భరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సర్కార్ వాటాపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. వచ్చే ఐదేళ్లకు మొత్తం 2వేల159 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.ఇప్పటికే 300 కోట్లు విడుదల చేసినందున ఇంకా 18వందల 59 కోట్లు అవసరం అని లెక్క వేసింది.ఈ మొత్తాన్ని హాడ్కో లేదా ఇతర బ్యాంకుల నుంచి మూడేళ్ళలో చెల్లించేలా ఋణం తీసుకునేందుకు అమరావతి మెట్రో కార్పొరేషన్ కు అనుమతినిచ్చింది. ఈ రుణానికి ప్రభుత్వం గారంటీ ఇచ్చింది. రాష్ట్ర నిధులపై క్లారిటీ రావడంతో త్వరలోనే కేంద్ర నిధులపైనా స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే గతంలో జైకా వంటి సంస్థలతో రుణాల కోసం ప్రయత్నం చేసినా...నిబంధనలు అడ్డుపడటంతో హాడ్కో నిధులతో మెట్రో పనులు వేగం కానున్నాయి.
తాజా వార్తలు
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..







