పాక్లో కల్తీ మద్యం సేవించి 32 మంది మృతి..
- December 27, 2016
పాకిస్థాన్లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టొబా టెక్ సింగ్ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో ఈ విషాదం జరిగింది. క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు. సోమవారం ఉదయానికి వారిలో కొందరు ప్రాణాలు విడవగా.. మరికొంత మంది ఆసుపత్రిపాలయ్యారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









