ఏసుదాస్ కి పాద పూజ నిర్వహించిన ఎస్ పి బాలసుబ్రమణ్యం

- December 30, 2016 , by Maagulf
ఏసుదాస్ కి పాద పూజ నిర్వహించిన ఎస్ పి బాలసుబ్రమణ్యం

ఒక దిగ్గజ గాయకుడికి మరో దిగ్గజ గాయకుడు పాదపూజ చేశారు. ఈ అపురూప ఘట్టానికి చెన్నై వేదికైంది. ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసు సినీరంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయనకు పాదపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పలువురు సినీరంగ ప్రముఖులు తరలివచ్చారు. గతంలో ఎస్పీబీకి యేసుదాసుకు మధ్య విభేదాలు పొడసూపినట్టు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎస్పీబీ ఈరోజు నిరూపించారు. యేసుదాసును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న బాలసుబ్రహ్మణ్యం ఆయన కాళ్లు కడిగి, పూలతో పాదపూజ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com