ఏసుదాస్ కి పాద పూజ నిర్వహించిన ఎస్ పి బాలసుబ్రమణ్యం
- December 30, 2016
ఒక దిగ్గజ గాయకుడికి మరో దిగ్గజ గాయకుడు పాదపూజ చేశారు. ఈ అపురూప ఘట్టానికి చెన్నై వేదికైంది. ప్రముఖ గాయకుడు కేజే యేసుదాసు సినీరంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆయనకు పాదపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పలువురు సినీరంగ ప్రముఖులు తరలివచ్చారు. గతంలో ఎస్పీబీకి యేసుదాసుకు మధ్య విభేదాలు పొడసూపినట్టు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎస్పీబీ ఈరోజు నిరూపించారు. యేసుదాసును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న బాలసుబ్రహ్మణ్యం ఆయన కాళ్లు కడిగి, పూలతో పాదపూజ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







