మన కవి "కాళోజి "
- September 09, 2015
"కాళోజి " కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఒక అక్షరతో లక్ష మెదళ్ళను కదిలించవచ్చు అని నమ్మినవాడు . ఒక ఉద్యమకర్త , ఒక సామాజికవేత్త. గిడుగు రామ్మూర్తి ప్రజలకు అర్ధం అయ్యే భాషలోనే గ్రంధ రచన సాగాలి అని కోరుకుంటే , ప్రజలు మాట్లాడుకొనే భాషలో రచన సాగాలి అని నమ్మినవాడు, రాసినవాడు. ప్రతి భాషకు మాండలీకాలు సహజం , తన దైన మాండలీకాన్ని ప్రజలందరికీ అర్ధం అయ్యేలా రచించి, ఆ మాండలీకాల సొగసును అందరికి అందించినవాడు. అయన రాసింది, ప్రభువుల కోసం కాదు, ప్రజల కోసం, అయన "నా గొడవ" అన్నది ప్రతివాడి గొడవ . అయన పేరు మీద ఉత్సవాలు జరిపించటమే కాదు, అయన ఆశయాలు, ఆయన ఆవేదనలు కు పరిష్కారాలే ఆయనకు నివాళి. " రాణివాసమున రంజిల్లు రాజా , రైతు బాధలు తీర్చి రక్షింపలేవా , పట్టణపు సొగసుకై పాటుపడు రాజా , పల్లెకందము గూర్చు ప్రతిభయే లేదా " అన్నది అప్పటి నైజాం కే కాదు, ఇప్పటి పాలకులకు కూడా హెచ్చరికే . కాళోజి సంస్మరణ అంటే ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉన్న ఆవేదన స్మరించుకోవటమే . ఆయన కు ప్రాంతీయబేధాలు అంటగట్టటం అంటే కురచ మనస్తత్వాలను బయట పెట్టుకోవటమే. రాష్ట్రాలు రెండు కావచ్చు, నాలుగు కావచ్చు, వంద కావచ్చు కానీ మన అందరిది తెలుగు భాష , "దేశభాషలందు తెలుగు లెస్స " అన్నది అప్పుడే కాదు ఎప్పుడూ నిజమే. తెలుగు వాడినైనందుకు గర్వ పడతా, నా తెలుగు రెండు రాష్ట్రాల భాష అయినందుకు ఇంకా గర్వ పడతా . కాళోజి, గిడుగు ఇద్దరు స్మరణీయులే . తెలుగువారందరికి కావాల్సిన వారే.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









