మన కవి "కాళోజి "
- September 09, 2015
"కాళోజి " కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఒక అక్షరతో లక్ష మెదళ్ళను కదిలించవచ్చు అని నమ్మినవాడు . ఒక ఉద్యమకర్త , ఒక సామాజికవేత్త. గిడుగు రామ్మూర్తి ప్రజలకు అర్ధం అయ్యే భాషలోనే గ్రంధ రచన సాగాలి అని కోరుకుంటే , ప్రజలు మాట్లాడుకొనే భాషలో రచన సాగాలి అని నమ్మినవాడు, రాసినవాడు. ప్రతి భాషకు మాండలీకాలు సహజం , తన దైన మాండలీకాన్ని ప్రజలందరికీ అర్ధం అయ్యేలా రచించి, ఆ మాండలీకాల సొగసును అందరికి అందించినవాడు. అయన రాసింది, ప్రభువుల కోసం కాదు, ప్రజల కోసం, అయన "నా గొడవ" అన్నది ప్రతివాడి గొడవ . అయన పేరు మీద ఉత్సవాలు జరిపించటమే కాదు, అయన ఆశయాలు, ఆయన ఆవేదనలు కు పరిష్కారాలే ఆయనకు నివాళి. " రాణివాసమున రంజిల్లు రాజా , రైతు బాధలు తీర్చి రక్షింపలేవా , పట్టణపు సొగసుకై పాటుపడు రాజా , పల్లెకందము గూర్చు ప్రతిభయే లేదా " అన్నది అప్పటి నైజాం కే కాదు, ఇప్పటి పాలకులకు కూడా హెచ్చరికే . కాళోజి సంస్మరణ అంటే ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉన్న ఆవేదన స్మరించుకోవటమే . ఆయన కు ప్రాంతీయబేధాలు అంటగట్టటం అంటే కురచ మనస్తత్వాలను బయట పెట్టుకోవటమే. రాష్ట్రాలు రెండు కావచ్చు, నాలుగు కావచ్చు, వంద కావచ్చు కానీ మన అందరిది తెలుగు భాష , "దేశభాషలందు తెలుగు లెస్స " అన్నది అప్పుడే కాదు ఎప్పుడూ నిజమే. తెలుగు వాడినైనందుకు గర్వ పడతా, నా తెలుగు రెండు రాష్ట్రాల భాష అయినందుకు ఇంకా గర్వ పడతా . కాళోజి, గిడుగు ఇద్దరు స్మరణీయులే . తెలుగువారందరికి కావాల్సిన వారే.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







