2017 తొలి ట్రేడింగ్లో పసిడి ధర..
- January 02, 2017
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరకు 2016 డిసెంబర్ 31న బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. ఆ రోజున 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.200 తగ్గి రూ.28,300 పలికింది. నిన్న ఆదివారం.. జనవరి 1వ తేదీ కావడంతో బులియన్ ట్రేడింగ్ జరగలేదు. 2017లో ట్రేడింగ్ తొలిరోజైన సోమవారం పసిడి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం రూ.28,300 వద్దే ట్రేడింగ్ను కొనసాగించడం గమనార్హం. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు స్తబ్దుగా ఉండటంతో లావాదేవీలు ఆశించినంత స్థాయిలో జరగలేదని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క వెండి ధర రూ.100 తగ్గి, కిలో వెండి రూ.39,300 పలికింది.
పరిశ్రమల వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







