త్వరలో కృష్ణ,మహేష్ బాబుల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం
- September 11, 2015
మనం సినిమా సక్సెస్ తర్వాత ఫ్యామిలీ హీరోలంతా కలసి నటించే చిత్రాలు తెలుగులో ఎక్కువయ్యాయి. ఇప్పటికే పాండవులు-పాండవులు తుమ్మెదలో మంచు ఫ్యామిలీ మెంబర్స్ కలసి నటించగా.. చిరంజీవి 150వ సినిమాలో తమ ఫ్యామిలీ హీరోలంతా కాసేపు కనిపిస్తారని ఇటీవల రామ్ చరణ్ స్పష్టం చేశాడు. ఇక వెంకీ,రానా కలయికలో ఓ సినిమాకు సురేశ్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా.. ఈ తరహా ఫ్యామిలీ స్టారర్ ఒకటి తెరకెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సినిమాను తానే స్వయంగా నిర్మించాలనుకుంటున్నారట కృష్ణ కొన్నాళ్లుగా మహేశ్ తో కలసి నటించేందుకు మల్టీస్టారర్ కథలు వింటున్నారట కృష్ణ. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ దర్శకుడు చెప్పిన కథ దాదాపు ఓకే అయిందట. కూతురి హత్యకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకునే సీనియర్ సిటిజన్ గా కృష్ణ కనిపించనుండగా.. ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసర్ గా మహేశ్ పాత్ర ఉండనుందట. ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కృష్ణ.. ప్రస్తుతం మహేశ్ ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారట. కృష్ణ, మహేశ్ తో పాటు విజయనిర్మల, రమేశ్ బాబు, సుధీర్ బాబు, మహేశ్ కొడుకు గౌతమ్ కూడా ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సో. మహేశ్ ఓకే చెప్పి డేట్స్ ఇవ్వడమే ఆలస్యం.. ఘట్టమనేని ఫ్యామిలీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి.. మహేశ్ ఎప్పుడు ఓకే చెపుతాడో చూడాలి..!
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







