యదార్ధ సంఘటనల ఆధారంగా రానున్న 'రంగు'
- January 14, 2017
బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకుని 'నచ్చావులే' చిత్రంతో కథానాయకుడిగా మారాడు తనీష్. ఆ తర్వాత 'రైడ్', 'ఏం పిల్లో ఏం పిల్లడో' తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ నటుడు మరో కొత్త చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధమైంది. కార్తికేయ దర్శకత్వంలో తనీష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రంగు'. సినీవాలీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఫస్ట్లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించగా, యోగీశ్వర్ శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









