మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- January 15, 2017
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్పై రూ.0.42 పైసలు, డీజిల్పై 1.03 పైసల ధరను పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను సవరిస్తోన్న ఆయిల్ కంపెనీలు వరుసగా ఐదోసారి ధరలను పెంచాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర 70.66కు చేరుకోగా, డీజిల్ ధర 58.71పైసలకు చేరుకుంది. జనవరి 2వ తేదీన పెట్రోల్పై రూ.1.29, డీజిల్పై రూ.0.97 పైసల ధరను పెంచిన విషయం తెలిసిందే. ఆయిల్ ధరలు పెంచడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









