ఖతార్లో ఇండియన్ స్కూల్స్కి ఓవర్ ఫ్లో..
- January 18, 2017ఖతార్లో ఇండియన్ స్కూల్స్లో అడ్మిషన్స్ సందర్భంగా ఓవర్ ఫ్లో సమస్య వెంటాడుతోంది. అందుబాటులో ఉన్న సీట్లకంటే చాలా ఎక్కువగా దరఖాస్తులు వస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు నిరాశ తప్పడంలేదు. కొన్ని స్కూల్స్, మినిస్ట్రీ నుంచి అదనపు సీట్లకు సంబంధించిన అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. 2017-18 అకడమిక్ ఇయర్ కోసం అడ్మిషన్లు ప్రారంభం కాగా, సీట్ల కోసం పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎంఇఎస్ స్కూల్, ఇప్పటికే 8000 మంది స్టూడెంట్స్ని కలిగి ఉంది. అయితే ఆ స్కూల్ కెపాసిటీ కేవలం 5000 మాత్రమే. మిగతా ఇండియన్ స్కూల్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నిబంధనలకు మించి విద్యార్థుల్ని కలిగి ఉంటే మినిస్ట్రీ నుంచి విద్యాసంస్థలు సమస్యలు ఎదుర్కోక తప్పదు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా స్కూళ్ళు, మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిస్ట్రీ నుంచి ప్రత్యేక అనుమతుల కోసం చాలా స్కూల్స్ ఎదురుచూస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









