అనురాధ పౌడ్వాల్ పద్మశీ పురస్కారం
- January 25, 2017
న లభై ఏళ్లకు పైగా తన గాత్రంతో అలరిస్తున్న అనురాధ పౌడ్వాల్కు విశిష్ట గౌరవం దక్కింది. ఆమెను పద్మశీ పురస్కారం వరించింది. 16 భాషల్లో వేల గీతాలతో పాటకు పట్టం కట్టిన అనురాధ గాన ప్రస్థానమిదీ.
కర్నాటకకు చెందిన అనురాధ అసలు పేరు అల్కా నందకర్ణి.
21 ఏళ్ల వయసులో అమితాబ్ బచ్చన్ చిత్రం 'అభిమాన్'(1973)తో అనురాధ తొలిసారి తన గొంతు వినిపించింది. అదే ఏడాది మరాఠీ చిత్రసీమకూ పరిచయమైంది. 1976లో శత్రుఘ్న సిన్హా నటించిన 'కాళి చరణ్'తో అనురాధ చిత్రసీమ దృష్టిలో పడింది. అందులోని 'ఏక్ బటా దో.. దో బటే చార్..' గీతం ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఎస్.డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, జైదేవ్, కల్యాణ్ జీ ఆనంద్ జీ, బప్పీ లహరి, రాజేష్ రోషన్, ఆనంద్ మిలింద్, నదీమ్ శ్రావణ్, జతిన్ లలిత్, ఎ.ఆర్.రెహమాన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో అనురాధ ఎన్నో గీతాలతో ఆకట్టుకుంది. ఒక్క హిందీలోనే 5296 పాటలకు పైగా పాడింది. కన్నడ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, తమిళం, తెలుగు తదితర 16 భాషల్లో వందల పాటలు పాడింది. మరో వైపు ప్రైవేట్ ఆల్బమ్స్, భజన గీతాలు ఆలపించింది. ఆమె కుమార్తె కవితా పౌడ్వాల్ కూడా గాయకురాలిగా కొనసాగుతోంది.
హ్యాట్రిక్ ఫిలింఫేర్: అనురాధ ఆషికి (1990), దిల్ హై కీ మాంతా నహీ (1991), బేటా (1992) చిత్రాలతో వరుసగా మూడు సంవత్సరాలు ఫిలింఫేర్ పురస్కారాలు గెలుచుకుంది. మొత్తం 1989లో 'కలత్ నకలత్'లోని 'ఏక్ రెషామీ..' గీతానికి జాతీయ పురస్కారం గెలుచుకుంది. లతా మంగేష్కర్ తర్వాత డి.లిట్ గౌరవ డిగ్రీని అందుకున్న రెండో గాయకురాలిగా నిలిచింది. 'అభినవ లతా మంగేష్కర్'గా సంగీత దర్శకులతో పిలిపించుకుంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









