స్మార్ట్ వెహికిల్ ట్రయల్ రన్ పొడిగింపు..
- January 30, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), దుబాయ్ ప్రాపర్టీస్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అటానమస్ వెహికిల్ ట్రయల్ రన్ని, ఫిబ్రవరి 22 వరకు బిజినెస్ బేలో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వాహనానికి వస్తున్న స్పందన నేపథ్యంలో, ట్రయల్ రంగ్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. 10 సీటర్ వెహికిల్, 600 మీటర్ల లాంగ్ ట్రాక్ ద్వారా బిజినెస్ బేలో హల్చల్ చేయనుంది. 1500 మంది ఇప్పటికే ఈ వాహనంలో ప్రయాణించి, అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకున్నారు. మొదటి ట్రయల్ ఫేజ్లో వరల్డ్ డ్రేట్ సెంటర్ వద్ద, రెండో ట్రయల్ ఫేజ్లో మొహమ్మద్ బిన్ రషీద్ బౌలివార్డ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ డ్రైవర్లెస్ వాహనం, భవిష్యత్తులో సరికొత్త సంచలనాలకు వేదికవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఆరుగురు కూర్చోవడానికీ, నలుగురు నిల్చోవడానికీ అవకాశముంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనం ప్రయాణిస్తుంది. భద్రత పరంగా అత్యంత విశ్వసనీయమైన వాహనంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ముఖ్యంగా రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఈ వాహనాల వినియోగం సత్ఫలితాలనిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









