కతార్ మౌలిక సదుపాయాల పెట్టుబడిలో 95 శాతం ట్రాన్స్పోర్ట్ పధకాలకే
- September 16, 2015
రానున్న 5 నుండి 7 సంవత్సరాలలో, కతార్ దేశం తన పెట్టుబడులలో 95 శాతానికి పైగా ట్రాన్స్పోర్ట్ పధకాలకే కేటాయించనున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకించి 8500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్వర్క్ ను విస్తరించేందుకు, 200 బ్రిడ్జిలను, 30 సొరంగ మార్గాలను నిర్మిస్తామని ప్రకటించింది.
ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్ బిన్ న్యాసర్ బిన్ ఖలీఫా అల్-థాని కతార్ ట్రాన్స్పోర్ట్ ఫోరం ప్రారం భించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపాదిత ప్రాజెక్టులలో చాలా వానిని ఫీఫా వల్డ్ కప్-2022 కంటే 2 సంవత్సరాలముందే పూర్తిచేస్తామని రవాణా శాఖ మంత్రి హిజ్ హైనెస్ జస్సీమ్ సైఫ్ ఆహ్మెద్ అల్-సులైతీ తెలియజేశారు. పెట్రోలియం ఉత్పత్తులు కాని రంగాలు, సేవా రంగాలు కూడా దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ్దాయని ఆయన విశ్లేషించారు. కతార్ నేషణ విజన్-2030 లక్ష్య సాధన దిశగా అన్ని పనులు కొనసాగుతున్నాయని, ఇటీవల ప్రారంభించబడిన, మధ్య ప్రాచ్యంలోనే అతిపెద్డదైన హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఇందులో భాగమేనని అన్నారు. ఒకేసారి 21 సొరంగాలు తవ్వె యంత్రాలతో పని జరుపుతున్న 'దోహా మెట్రో' గిన్నిస్ రికార్డులలోకి ఎక్కిందని తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







