తెలంగాణ ఎంపీ కవిత ఇవాళ అమరావతికి వెళ్లనున్నారు...

- February 09, 2017 , by Maagulf
తెలంగాణ ఎంపీ కవిత ఇవాళ అమరావతికి వెళ్లనున్నారు...

హైదరాబాద్: తెలంగాణ ఎంపీ కవిత ఇవాళ అమరావతికి వెళ్లనున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో కవిత పాల్గొననున్నారు. మొదట కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం సదస్సుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సదస్సులో ఏపీకి చెందిన మంత్రులతో పాటు, కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సదస్సులో పాల్గొంటారు. కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, నాలుగు రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరు కానున్నారు. శ్రీలంక ప్రథమ మహిళ మైత్రేయి విక్రమసింఘె, అమెరికా చట్ట సభ ప్రతినిధి అరుణ్‌మిల్లర్‌, కెన్యా నుంచి నలుగురి రాక ఖరారైందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com