ఫిఫా అండర్-17 ప్రపంచకప్ మస్కట్!
- February 10, 2017
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న అండర్-17 ఫుట్బాల్ ఫిఫా ప్రపంచకప్ పోటీల అధికారిక మస్కట్ విడుదలైంది. న్యూదిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 'ఖేలియో'ను కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్గోయల్, స్థానిక క్రీడల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్లు విడుదల చేశారు. దక్షిణాసియాలో ఎక్కువగా కనిపించే చిరుతను ఈ క్రీడలకు మస్కట్గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి గోయల్ మాట్లాడుతూ.. 'భారత్లో జరిగిన క్రీడా కార్యక్రమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ మస్కట్ గుర్తిండిపోతుంది.
'ఖేలియో' యంగ్, వైబ్రెంట్, ఉత్సాహభరితం దేశాన్ని ప్రతిబింబించేందుకు ఇదే సరైనది. ఫుట్బాల్ క్రీడ మరింత ఉత్సాహంగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది' అని అన్నారు.
2017 సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్లోని ఆరువేదికల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ ప్రపంచకప్లో భారత్ సహా 24 జట్టు పాల్గొంటాయి.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







