లులు ఫిల్స్ తొలి 24 గంటల బ్రాంచ్ ప్రారంభం
- February 28, 2017
మనామా: లులు ఫిల్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ 24 గంటల పాటు పనిచేసే ఔట్లెట్ని ప్రారంభించింది. లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ఎల్ఎల్సికి సంబంధించిన లులు ఫిల్స్, ఫిలిప్పీన్స్లో ఈ మూడవ బ్రాంచ్ని ప్రారంభిస్టున్నట్లు వెల్లడించింది. నినాయ్ అక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ - మనీలాలోని టెర్మినల్ 1లో దీన్ని ప్రారంభించారు. ఇది లులు ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్కి సంబంధించి 136వ బ్రాంచ్. లులు ఫిల్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రెసిడెంట్ మరియు చైర్మెన్ ఆఫ్ ది బోర్డ్ అదీబ్ అహ్మద్ ఈ బ్రాంచ్ని ప్రారంభించారు. ఆర్థిక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటని అదీబ్ అహ్మద్ చెప్పారు. 2014లో ఫిలిప్పీన్స్లోని మనీలాలో లులు ఫిల్స్ మెయిన్ బ్రాంచ్ని ప్రారంభించింది. తాజా బ్రాంచ్లో 24 గంటలపాటు పలు సేవలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









