సీక్వెల్ కి ఓకే చెప్పిన సందీప్ కిషన్

- March 08, 2017 , by Maagulf
సీక్వెల్ కి ఓకే చెప్పిన సందీప్ కిషన్

సందీప్ కిషన్ ఓ సీక్వెల్ కి ఓకే చెప్పాడు. సీక్వెల్ అంటే తను చేసిన సినిమా కాదు. కార్తీ చేసిన యాక్షన్ త్రిల్లర్ నా పేరు శివ. ఇప్పుడు ఆ సినిమా కు సీక్వెల్ తయారవుతోంది. ఈ సీక్వల్ సందీప్ కిషన్ చేస్తున్నాడు. సందీప్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో తయారయ్యే ఈ సినిమాకుదాదాపు నాపేరు శివ టీం పనిచేస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వం వహించే ఈ సినిమా లవ్ అండ్ రివెంజ్ ఫార్ములాతో ఉటుందని టాక్.
. ప్రస్తుతం నక్షత్రం తో బిజీగా వున్నాడు సందీప్. కృష్ణ వంశీదర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సందీప్‌ కిషన్‌, రెజీనా, సాయి ధరమ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలలో ఈ సినిమా రూపుదిద్దుకుటుంది.
కె. శ్రీనివాసులు, ఎస్‌. వేణుగోపాల్‌, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com