అరార్ లో ఆహారం కలుషితం కావడంతో 27 మంది విద్యార్ధులకు అస్వస్థత

- March 09, 2017 , by Maagulf
అరార్ లో  ఆహారం కలుషితం కావడంతో 27 మంది విద్యార్ధులకు అస్వస్థత

స్థానిక అరార్ లోని ఒక బాలుర పాఠశాల ఫలహారశాలలో ఆహారం కలుషితం కావడంతో  బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న 27 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. విద్యార్థులను వైద్యం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో అరార్ బాలుర పాఠశాలలో 27 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆరోగ్యపరంగా  ఇబ్బందులు పడుతున్నట్లు ఫోన్ కాల్ అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం  స్థిరమైన స్థితిలో ఉందని వారిని  ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు, మంత్రిత్వ శాఖ తెలిపింది.పాఠశాల జరుగుతున్ నసమయంలో ఫలహారశాలలో లభించే అరార్ బేకరీలలోని ఆహార పదార్ధాలను తిన్న విద్యార్థులకే ఈ ఇబ్బందులు తలెత్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com