గోల్డ్‌పై ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

- March 09, 2017 , by Maagulf
గోల్డ్‌పై ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

ఆర్‌బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ- ఎన్‌బీఎఫ్‌సీలు బంగారంపై సామాన్యులకు ఇచ్చే 
రుణాలు రూ. 25వేలకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేలా ప్రభుత్వం 
చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా బంగారంపై 
లక్ష రూపాయల వరకు నగదు, ఆపై మొత్తాన్ని చెక్కురూపంలో చెల్లిస్తున్నారు.
ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం నగదు పరిమితిని రూ.20వేలకు తగ్గించామని ఆర్‌బీఐ పేర్కొంది. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికీ మనీ దొరక్క ఏటీఎం వల్ల ప్రజలు బారులు తీస్తున్న సంగతి తెల్సిందే! ఓ వైపు బ్యాంకు ఖాతా నిర్వహణ సంబంధించిన లావాదేవీలపై రుసుములు, ఇంకోవైపు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకునేవాళ్లకి కొత్త రూల్స్ ఇబ్బందులు ఖాయమని అంటున్నారు సామాన్యులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com