యూఏఈ మీడియా - వాక్ టు గివ్
- March 09, 2017
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 'ఇయర్ ఆఫ్ గివింగ్' ఇనీషియేటివ్ని ప్రారంభించగా, దానికి తమవంతు సహకారం అందించేందుకుగాను నేషనల్ మీడియా కౌన్సిల్ (ఎన్ఎంసి) 'వాక్ టు గివ్' అనే ఇనీషియేటివ్ని ప్రారంభించింది. మార్చ్ 17న జాయెద్ స్పోర్ట్స్ సిటీ నుంచి షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ వరకూ అఉదాబీలో 'మార్చ్' నిర్వహించనున్నారు మీడియా రంగానికి చెందిన ప్రతినిథులు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఎన్ఎంసి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జబర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పలు ముఖ్యమైన కార్యక్రమాలకు మీడియా మద్దతు అవసరమని అన్నారు. ఇయర్ ఆఫ్ గివింగ్ అనే గొప్ప ఇనీషియేటివ్కి మీడియా మద్దతు పలకడం చాలా గొప్ప విషయమని చెప్పారాయన. మంచి సమాజం కోసం మీడియా ప్రతినిథులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందనీ, ఈ క్రమంలో యూఏఈ మీడియా ప్రతినిథుల పాత్ర ఎంతో గొప్పగా ఉందని అభిప్రాయపడ్డారాయన.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







