యూఏఈ మీడియా - వాక్ టు గివ్
- March 09, 2017
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 'ఇయర్ ఆఫ్ గివింగ్' ఇనీషియేటివ్ని ప్రారంభించగా, దానికి తమవంతు సహకారం అందించేందుకుగాను నేషనల్ మీడియా కౌన్సిల్ (ఎన్ఎంసి) 'వాక్ టు గివ్' అనే ఇనీషియేటివ్ని ప్రారంభించింది. మార్చ్ 17న జాయెద్ స్పోర్ట్స్ సిటీ నుంచి షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ వరకూ అఉదాబీలో 'మార్చ్' నిర్వహించనున్నారు మీడియా రంగానికి చెందిన ప్రతినిథులు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఎన్ఎంసి డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జబర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పలు ముఖ్యమైన కార్యక్రమాలకు మీడియా మద్దతు అవసరమని అన్నారు. ఇయర్ ఆఫ్ గివింగ్ అనే గొప్ప ఇనీషియేటివ్కి మీడియా మద్దతు పలకడం చాలా గొప్ప విషయమని చెప్పారాయన. మంచి సమాజం కోసం మీడియా ప్రతినిథులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందనీ, ఈ క్రమంలో యూఏఈ మీడియా ప్రతినిథుల పాత్ర ఎంతో గొప్పగా ఉందని అభిప్రాయపడ్డారాయన.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







